Skip to main content

పలాసలో డి పట్టా భూముల్లో వివాదం

పలాసలో డీ పట్టా భూముల్లో వివాదం...

గతంలో ఈ భూముల్లో ప్రభుత్వ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు శంకుస్థాపన... మరి నేడు ఆ భూముల్లో వ్యాపారులు తగాదాలు. ప్రభుత్వ పోరంబోకు భూముల్లో వివాదాలకు కేంద్రంగా మారింది. కోట్లు విలువ చేసే భూములు కావడంతో ఒకరు నుంచి ఒకరు చేతులు మారి నేడు కోర్టు చుట్టూ తిరుగుతూ ఆ భూముల్లో తగాదాలు పడుతున్నారు. గతంలో అప్పటి టిడిపి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు జిల్లా రెవెన్యూ అధికారులు శంకుస్థాపన కూడా చేశారు. నేడు ఆ భూముల్లో తమది అంటూ తమదని వ్యాపారులు తగాదాలు పడుతుండగా రెవెన్యూ అధికారులు తమకేమి సంబంధం లేదని చేతులు ఎత్తివేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. 

పలాస మండలం కోసంగిపురం జంక్షన్ బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో సర్వేనెంబరు 67లో ఉన్న ప్రభుత్వ పోరంబోకుభూమి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది.  198 ఎకరాల భూమిలో 150 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సుడాకు అప్పగించి ప్రభుత్వ లేఅవుట్గా అభివృద్ధి చేస్తుండగా మిగిలిన భూమి అసెండ్గా మారి కొంతమందికి పట్టాలు ఇచ్చినట్లు రికార్డులు ఉన్నాయి. ఎక్కడైనా ప్రభుత్వ భూమి చేతులు మారాలంటే ప్రత్యేకంగా కమిటీ వేసి వాటిని అందించాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం కొనుగోలు పత్రాలతో ఐదెకరాల భూమి ఐదుగురు వ్యక్తుల చేతులుమారి చివరకు మిలట్రీపోరంబోకు భూమిగా రూపాంతరం చెందింది. చివరకు ఆ భూమి కూడా నిరభ్యంతరపత్రాలు తెచ్చుకొని పబ్లిక్గా అమ్మకానికి పెట్టుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ భూమిలోనే 2018 ఏడాదిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 60 సెంట్లు స్థలంలో ప్రభుత్వ పెట్రోలుబంకు, పౌరసరఫరాల గిడ్డంగి నిర్మించడానికి రూ.కోటి వ్యయంతో ఎమ్మెల్యే హోదాలో గౌతు శ్యామసుందర శివాజి, అప్పటి జాయంట్  కలెక్టర్ చక్రధర్ బాబు కలిపి శంకుస్థాపన కూడా చేసారు. ఏమి జరిగిందో గాని కనీసం ఆ ప్రాంతంలో ప్రస్తుతం శిలాఫలకం  కూడా కనిపించడం లేదు. ఇదీ అక్కడ ప్రభుత్వ భూమి ఏ విధంగా రెక్కలు విడిచిందో చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జిరాయతీ భూమి అయితే రూ.20 కోట్ల వరకూ ఉంటుంది. దీని ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో 14 ప్రైవేటు వ్యక్తులకు దాఖలు పడిన భూమి విలువ రూ100 కోట్లు ఉంటుందని అంచనా.  ఇదిలా ఉండగా కాశీబుగ్గకు చెందిన 
 తాళాను ఈశ్వరరావు అనే జీడి వ్యాపారికి అదే సర్వే నెంబరులో  ఆరు సెంట్లు స్థలం ప్రభుత్వం నుంచి ఆయనకు పట్టారూపంలో వచ్చింది. ప్రభుత్వ పెట్రోలు బంకు ఏర్పాటు చేస్తామన్న సమయంలో ఇది ప్రభుత్వ బంజరు భూమి, ఇందులో ఎవరికీ పట్టాలు ఇవ్వడం జరగదని, ఇచ్చినా వాటిని ప్రభుత్వ అవసరాలకు స్వాధీనం చేసుకుంటామని అప్పటి రెవిన్యూ అధికారులు చెప్పడంతో ఆయన తన స్థలాన్ని ధారాదత్తం చేసారు. ప్రస్తుతం ఆ స్థలంను ముగ్గురు వ్యక్తులు నందిగాం మం డలానికి చెందిన ఓ వైసీపీ నాయకుడి నుంచి కొనుగోలు చేసారు. ఆయనకు కూడా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన మాజీ సైనికోద్యోగి నుంచి దఖలుపడినట్లు రికార్డులు ఉన్నాయి. ఈ స్థలం తమదని, మిలట్రీఉద్యోగికి చెందిన ఈ స్థలంలో నిరభ్యంతరపత్రాలు కూడా ఉన్నాయని, పెట్రోలు బంకు, గిడ్డంగులు నిర్మించడానికి వీలులేదంటు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి ఆ స్థలం కోర్టుద్వారా దఖలుపడినట్లు రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. ఇదే సర్వేనెంబరులో ఆరు సెంట్లు స్థలాన్ని తాను ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేసినట్లు పద్మనాభపురం గ్రామానికి చెందిన సాహుకారి లక్ష్మి కాంతమ్మ అనే మహిళ ఆరేళ్ల నుంచి పోరాటం చేస్తోంది. ఇందులో తనకు చెందిన స్థలాన్ని కూడా వ్యాపారులు ఆక్రమించుకొని తనకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా తాళాను ఈశ్వరరావు తనకు చెందిన స్థలాన్ని తనకే చెందాలని పలాస కోర్టులో దావా వేయగా తనకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డరు అందించింది. ఈ మేరకు మంగళవారం ఆయన భవననిర్మాణ కార్మికులను వెంటపెట్టుకొని సర్వేనెంబరు 67 లో వివాదస్థలానికి చేరుకొని కంచె నిర్మాణం చేపట్టడానికి ఉపక్రమించారు. దీంతో అప్పటికే స్థలాన్ని చదునుచేసి కంచె, ఇతర నిర్మాణాలు చేస్తున్న వ్యాపారులు రావడంతో ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువురు తీవ్రవాదనలు చేసుకున్నారు. అనంతరం పోలీసుకంట్రోల్ నెం బరుకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువుర్ని పోలీస్టేషన్కు తరలించారు. రెవిన్యూ, పోలీసులు సంయుక్తంగా స్థలాన్ని పరిశీలించి నిర్ణయానికి వస్తారని, అంతవరకూ ఇరువర్గాలు పనులు ప్రారంభించవద్దని సూచించడంతో వివాదం సద్దుమణిగింది. పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో ఆర్డీఓ కార్యాలయంతో ఇతర ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్డీఓ బంగ్లా వంటి నిర్మాణం కోసం స్థలాలు వెతుకుతున్న అధికారులు ప్రభుత్వ పోరంబోకు స్థలాలుగా గుర్తింపు ఉన్న సర్వేనెంబరు 67 భూములు ఎందుకు కనిపించడం లేదో అన్న సందేహాలు సర్వత్రా 13 వ్యక్తమవుతున్నాయి. బడాబాబుల ఆధీనంలో ఉన్న ఈ భూములు సేకరిస్తే ప్రభుత్వం, ప్రజలకు మేలుజరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వివాదస్పదభూముల వ్యవహారంపై పలాస తహశీల్దార్ టి.కళ్యాణచక్రవర్తిని వివరణ కోరగా హైకోర్టు ఉత్తర ట్వలు ఉన్న కారణంగా తాము వివాదంలో తలదూర్చలేదని, ఇది పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని స్పష్టం చేసారు. గతంలో రెవిన్యూశాఖ పౌరసరఫరాగిడ్డంగి, పెట్రోలుబంకు ఏర్పాటుకు స్థలం కేటాయించి భూమిపూజ చేసిన విషయం వాస్తవమేనని, అయితే కోర్టుల కారణంగా నిర్మాణం జరగలేదన్నారు.


High Viewed News

లక్ష్మీపురం లో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం నాటి కార్యక్రమ వివరాలు.

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం నాటి కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 23వ వార్డ్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4-30 గంటల నుండి టిడిపి కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. కావున కూటమి నేతలు, పలాస నియోజకవర్గం ప్రజలు గమనించగలరని టిడిపి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

కొత్తవూరులో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కొత్తవూరు గ్రామంలో పశు వైద్య అధికారి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 150 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రమణ, మహేష్, రేవతి, సుమతి, గోపాల మిత్ర రామారావు, వాసు పాల్గొన్నారు.

నేటి వార్తల్లో ముఖ్యాంశాలు...

  ఏపీలో త్వరలో డ్రోన్ టాక్సీలు, అంబులెన్సులు: CM       CBN * TG: మేడారంలో CM రేవంత్ ప్రత్యేక పూజలు * AP: పెట్టుబడులు రాకుండా YCP అడ్డుకుంటోంది: మంత్రి లోకేశ్ * TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు సిట్ నోటీసులు * TG: ప్రశ్నిస్తున్నందుకే హరీశ్కు తప్పుడు కేసులో నోటీసులు: KTR * BJP జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక * భారత పర్యటనకు UAE ప్రెసిడెంట్.. కీలక ఒప్పందాలు

పలాసలో రేపటి నుంచి జరగనున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

ఈనెల 25వ తేదీ నుంచి పలాస రైల్వే గ్రౌండ్ లో రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెటర్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ATBPL ఒక ప్రాంతంలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనే జట్టులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. రిజిస్ట్రేషన్ కొరకు www.atbpl.in లేదా 7901233535 నెంబర్ కు సంప్రదించాలన్నారు.