శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉపాధి నిమిత్తం కాంతారావు తన కుటుంబంతోపాటు విశాఖలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి తన భార్య సంధ్య (37), కుమార్తె మహేశ్వరి (9) తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. సింహాచలం గోశాల సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కాంతారావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రంగా గాయపడిన తల్లి కూతురును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులందరినీ పోగొట్టుకున్న గుర్నాథ్ (11) అనాది అయ్యాడు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.