శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉపాధి నిమిత్తం కాంతారావు తన కుటుంబంతోపాటు విశాఖలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి తన భార్య సంధ్య (37), కుమార్తె మహేశ్వరి (9) తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. సింహాచలం గోశాల సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కాంతారావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రంగా గాయపడిన తల్లి కూతురును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులందరినీ పోగొట్టుకున్న గుర్నాథ్ (11) అనాది అయ్యాడు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.