శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు మంగళవారం ఉదయం చేపల వేటకు వెళ్లారు. తోటి మత్స్యకారులుతో కలిసి వేట సాగిస్తుండగా... ప్రమాదవశాత్తు మత్స్యకారుడు కర్రి విశ్వనాథం (34) పట్టు తప్పి సముద్రంలో పడిపోయాడు... ఇదే సమయంలో పడవకు ఉన్న ఫ్యాన్ అతను తగలడంతో తీవ్ర గాయాలతో విశ్వనాథం మృతి చెందాడు. తోటి మత్స్యకారులు ఆయన మృతదేహాన్ని అతి కష్టంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు సముద్ర తీరానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. విశ్వనాథం మృతదేహాన్ని చూసేందుకు సమీప ప్రాంత ప్రజలు వందలాదిమందిగా తీరానికి చేరుకున్నారు. మృతునికి భార్య ఈశ్వరితో పాటు 6, 9 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.