శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు మంగళవారం ఉదయం చేపల వేటకు వెళ్లారు. తోటి మత్స్యకారులుతో కలిసి వేట సాగిస్తుండగా... ప్రమాదవశాత్తు మత్స్యకారుడు కర్రి విశ్వనాథం (34) పట్టు తప్పి సముద్రంలో పడిపోయాడు... ఇదే సమయంలో పడవకు ఉన్న ఫ్యాన్ అతను తగలడంతో తీవ్ర గాయాలతో విశ్వనాథం మృతి చెందాడు. తోటి మత్స్యకారులు ఆయన మృతదేహాన్ని అతి కష్టంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు సముద్ర తీరానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. విశ్వనాథం మృతదేహాన్ని చూసేందుకు సమీప ప్రాంత ప్రజలు వందలాదిమందిగా తీరానికి చేరుకున్నారు. మృతునికి భార్య ఈశ్వరితో పాటు 6, 9 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎయిర్పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ఉపాధి అవకాశాలు: ఎయి...