గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరుతూ... పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహిస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్ర శనివారం పలాస కు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు. పలాస ఇందిరా చౌక్ నుంచి కేటి రోడ్డు మీదుగా... వేలాదిమంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో.. అంటూ విద్యార్థులు ఫ్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాశీబుగ్గ డిఎస్పి షేక్ సహబజ్ అహ్మద్, సిఐ రామకృష్ణ, ఎస్సై నరసింహమూర్తి సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎయిర్పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ఉపాధి అవకాశాలు: ఎయి...