గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరుతూ... పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహిస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్ర శనివారం పలాస కు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు. పలాస ఇందిరా చౌక్ నుంచి కేటి రోడ్డు మీదుగా... వేలాదిమంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో.. అంటూ విద్యార్థులు ఫ్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాశీబుగ్గ డిఎస్పి షేక్ సహబజ్ అహ్మద్, సిఐ రామకృష్ణ, ఎస్సై నరసింహమూర్తి సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.