శ్రీకాకుళం జిల్లా పలాసలో నూతన సంవత్సర వేడుకలు అర్ధరాత్రి 01:00 గంటలు వరకు మాత్రమే అనుమతి ఉందని కాశీబుగ్గ సిఐ రామకృష్ణ మీడియాతో తెలిపారు. ఎవరైనా కల్చరల్ ప్రోగ్రామ్స్, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాలని కోరారు. రాత్రి వేళల్లో మద్యం మత్తులో వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.