శ్రీకాకుళం జిల్లా పలాసలో నూతన సంవత్సర వేడుకలు అర్ధరాత్రి 01:00 గంటలు వరకు మాత్రమే అనుమతి ఉందని కాశీబుగ్గ సిఐ రామకృష్ణ మీడియాతో తెలిపారు. ఎవరైనా కల్చరల్ ప్రోగ్రామ్స్, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాలని కోరారు. రాత్రి వేళల్లో మద్యం మత్తులో వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.