శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో శనివారం స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర భాగంగా... జంట పట్టణాలలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్టిసి కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్ మీదుగా కాశిబుగ్గ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పర్యావరణ రంగంలో అవకాశాలు గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ పీరుకట్ల విఠల్రావు, మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, సీఐ రామకృష్ణ, సచివాలయ, మెప్మా సిబ్బందితోపాటు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.
ఎయిర్పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ఉపాధి అవకాశాలు: ఎయి...