శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో శనివారం స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర భాగంగా... జంట పట్టణాలలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్టిసి కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్ మీదుగా కాశిబుగ్గ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పర్యావరణ రంగంలో అవకాశాలు గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ పీరుకట్ల విఠల్రావు, మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, సీఐ రామకృష్ణ, సచివాలయ, మెప్మా సిబ్బందితోపాటు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.