శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో శనివారం స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర భాగంగా... జంట పట్టణాలలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్టిసి కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్ మీదుగా కాశిబుగ్గ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పర్యావరణ రంగంలో అవకాశాలు గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ పీరుకట్ల విఠల్రావు, మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, సీఐ రామకృష్ణ, సచివాలయ, మెప్మా సిబ్బందితోపాటు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.