Skip to main content

వార్తల్లో నేటి ముఖ్యాంశాలు...

*ఏపీ: అల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... లోయలో పడ్డ బస్సు 15 మంది యాత్రికులు మృతి.

TG: ప్రశాంతంగా ముగిసిన తొలివిడత పంచాయతీ ఎన్నికలు

* పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా

* రాష్ట్ర బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ అసహనం

* AP: రూ.20,444 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం

* కడప మేయర్ స్థానం వైసీపీ కైవసం

* ప్రయాణికులకు ఇండిగో రూ.10 వేల ట్రావెల్ వోచర్లు

* ఆరు రాష్ట్రాల్లో SIR గడువును పెంచిన ఈసీ

* పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం

* సీడ్ యాక్సెస్ రహదారి-NH16 అనుసంధాన పనులకు రూ.532కోట్లకు గ్రీన్ సిగ్నల్

* AP ప్రిజన్స్ &కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుకు ఓకే

* రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదం

* SIPBలో తీసుకున్న నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

* కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యామ్ల నిర్వహణకు పరిపాలన అనుమతుల మంజూరుకు ఆమోదం

* రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు AP క్యాబినెట్ ఆమోదం

* అమరావతిని శాశ్వత రాజధాని చేసేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెడతాం: కేంద్రమంత్రి పెమ్మసాని

* తెలంగాణలో ముగిసిన పంచాయతీ తొలి విడత ఎన్నికలు

* TGలో ఇంటర్ వరకు ఒకే బోర్డు ఉండేలా విద్యా శాఖ చర్యలు

* పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై దక్షిణాది BJP MPలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ

* అఫ్గానిస్థాన్పై పాక్ వైమానిక దాడులను UN భద్రతా మండలిలో ఖండించిన భారత్

* HYD వేదికగా ఈ నెల 19 నుంచి 21 వరకు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ప్రదర్శనకు 700+ షార్ట్ ఫిల్మ్స్ రాగా 60 ఎంపికయ్యాయి.

* పలువురు కాంగ్రెస్ MLAలు, నాయకులకు క్యాబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఎర్రోళ్ల శ్రీనివాస్(BRS) హైకోర్టులో పిల్ వేశారు.

* వర్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు MP అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు.

* తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు

* హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపు.. కొన్ని గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్

* రైతుల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్: CM CBN

* ట్రంప్కు PM మోదీ ఫోన్.. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు

* పనితీరు మారాలంటూ TBJP ఎంపీలకు PM మోదీ హితబోధ

* సౌతాఫ్రికాతో రెండో టీ20లో భారత్ ఓటమి.

High Viewed News

ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది : జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్

ఎయిర్‌పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష  ​శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ​​ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ​సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ​ఉపాధి అవకాశాలు: ఎయి...

పలాసలో హౌసింగ్ అధికారుల దందా...!

పీఎం జన్ మన్ ఇళ్ల లబ్ధిదారుల వద్ద హౌసింగ్ అధికారులు దోచుకుంటున్నారు. అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల వారికి ఇల్లు నిర్మాణానికి 2023లో "పీఎం జన్ మన్" పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పలాస మండల పరిధిలో లోత్తూరు, లొద్దభద్ర, అల్లుకోల, తర్లాకోట పంచాయతీల పరిధిలో 60 ఇల్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులు ఇల్లు నిర్మిస్తే రూ. 2.39 లక్షలు వారి బ్యాంక్ ఖాతాలో జామవుతుంది. కాగా హౌసింగ్ అధికారులు లబ్ధిదారుల వద్ద ఖర్చుల పేర్లతో సొమ్ము పడిన ప్రతిసారి డబ్బు వసూలు చేస్తున్నట్లు లబ్ధిదారులు తెలిపారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు పలాస వాసులు మృతి

తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులు మృతి. నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయ్యప్ప మాలదరించి 6 గురు యువకులు శబరిమలై వెళ్లి అక్కడ నుంచి రామేశ్వరం దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్ (24), పైడి సాయి (26) గా పోలీసులు గుర్తించారు.

పలాసలో కల్తీ మద్యం ఉత్తిదే : ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు

పలాస–కాశీబుగ్గ ప్రాంతంలో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారు ఆధారాలతో ముందుకు రావాలని, వారి సమక్షంలోనే సంబంధిత దుకాణాల నుంచి మద్యం నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

బారువ సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం సోంపేట మండలం బారువ సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, JC ఫర్మన్ అహ్మద్ ఖాన్ తో కలసి యోగా ఆసనాలను వేశారు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి యోగా ద్వారా మానసిక శరీరిక ప్రశాంతతను పొంద వచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.