శ్రీకాకుళం జిల్లా డివిజన్ కేంద్రం పలాసలో ఎంతో ఉత్కంఠ ంగా చూస్తున్న నందమూరి అభిమానులకు నిరాశ మరోసారి ఎదురైనట్లు కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా ఇప్పటికే రెండుసార్లు పలు కారణాల చేత వాయిదా పడిన విషయం తెలిసిందే... నేడు ప్రీమియర్ షో వేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో అనుమతి లభించడంతో... పలాస శ్రీ వెంకటేశ్వర సినిమా హాల్ వద్దకు నందమూరి అభిమానులు భారీగా చేరుకున్నారు. రాత్రి 10 అవుతున్న సినిమా హాల్ గేట్లు తెరవకపోవడంతో అ ప్రాంతం ఉద్రిక్తతగా మారింది.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.