శ్రీకాకుళం జిల్లా డివిజన్ కేంద్రం పలాసలో ఎంతో ఉత్కంఠ ంగా చూస్తున్న నందమూరి అభిమానులకు నిరాశ మరోసారి ఎదురైనట్లు కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా ఇప్పటికే రెండుసార్లు పలు కారణాల చేత వాయిదా పడిన విషయం తెలిసిందే... నేడు ప్రీమియర్ షో వేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో అనుమతి లభించడంతో... పలాస శ్రీ వెంకటేశ్వర సినిమా హాల్ వద్దకు నందమూరి అభిమానులు భారీగా చేరుకున్నారు. రాత్రి 10 అవుతున్న సినిమా హాల్ గేట్లు తెరవకపోవడంతో అ ప్రాంతం ఉద్రిక్తతగా మారింది.
శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన వేళ భారీ చోరీ జరిగిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక కోర్టు వీధిలో నివాసం ఉంటున్న వ్యాపారి తంగుడు మనోజ్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారు 30 తూలాల బంగారంతో పాటు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సోంపేట సీఐ మంగరాజు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.