శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణానికి చెందిన లల్లిప్రియ నాయక్ అనే బాలిక స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. నేడు పాఠశాలకు వెళ్లనని ఇంట్లో మారాం చేసింది దీంతో తల్లి అనీషా నాయక్ మందలించడంతో బాలిక ఇంటినుంచి వెళ్ళిపోయింది. ఎంత వెతికినా బాలిక జాడ తెలీకపోవడంతో తల్లి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన సీఐ రామకృష్ణ ఆదేశాలు మేరకు రెండు బృందాలుగా ఏర్పడిన పోలీసులు కేవలం రెండు గంటల్లో బాలికను ఆమె తల్లి వద్దకు చేర్చారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.