శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణానికి చెందిన లల్లిప్రియ నాయక్ అనే బాలిక స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. నేడు పాఠశాలకు వెళ్లనని ఇంట్లో మారాం చేసింది దీంతో తల్లి అనీషా నాయక్ మందలించడంతో బాలిక ఇంటినుంచి వెళ్ళిపోయింది. ఎంత వెతికినా బాలిక జాడ తెలీకపోవడంతో తల్లి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన సీఐ రామకృష్ణ ఆదేశాలు మేరకు రెండు బృందాలుగా ఏర్పడిన పోలీసులు కేవలం రెండు గంటల్లో బాలికను ఆమె తల్లి వద్దకు చేర్చారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.