పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభించేందుకు కేంద్ర బృందంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష బుధవారం తాత్కాలిక భవనమైన రైల్వే పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఏప్రిల్ 2026 నుంచి తాత్కాలిక భవనంలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మరో రెండు సంవత్సరాల్లో కేంద్ర విద్యాలయ పనులు పూర్తిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.