పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభించేందుకు కేంద్ర బృందంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష బుధవారం తాత్కాలిక భవనమైన రైల్వే పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఏప్రిల్ 2026 నుంచి తాత్కాలిక భవనంలో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మరో రెండు సంవత్సరాల్లో కేంద్ర విద్యాలయ పనులు పూర్తిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.