ఆర్టీసీ టికెట్ బుకింగ్ కోసం బస్టాండ్కో.. నెట్ సెంటర్కో వెళ్లి సమయం వృథా చేసుకుంటున్నారా! అంత ప్రయాస అవసరం లేదండోయ్!! రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మనమిత్ర- వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులువుగానే చేసుకునే అవకాశం ఉంది. ఈ సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.