ఆర్టీసీ టికెట్ బుకింగ్ కోసం బస్టాండ్కో.. నెట్ సెంటర్కో వెళ్లి సమయం వృథా చేసుకుంటున్నారా! అంత ప్రయాస అవసరం లేదండోయ్!! రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మనమిత్ర- వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులువుగానే చేసుకునే అవకాశం ఉంది. ఈ సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.