శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సున్నాడ గ్రామంలో ఏర్పాటుచేసిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం మంగళవారం నాటికి ఐదవ రోజుకి చేరుకుంది. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ అటవీ శాఖ డివిజన్ రేంజ్ ఆఫీసర్ మురళీకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని కోరారు. అటవీ జంతువులను వేటాడడం చట్టరీత్యా నేరం అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు, అధ్యాపకులు కోదండరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.