శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సున్నాడ గ్రామంలో ఏర్పాటుచేసిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం మంగళవారం నాటికి ఐదవ రోజుకి చేరుకుంది. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ అటవీ శాఖ డివిజన్ రేంజ్ ఆఫీసర్ మురళీకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని కోరారు. అటవీ జంతువులను వేటాడడం చట్టరీత్యా నేరం అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు, అధ్యాపకులు కోదండరావు తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.