శ్రీకాకుళం జిల్లా పలాస(M) రంగోయి గ్రామంలో శుక్రవారం రెవెన్యూ గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నంతో కూడిన కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... గడిచిన ప్రభుత్వంలో ఓ తుగ్లక్ పాలన చూసామని, మన తాతలు, తండ్రిల ఆస్తుల పుస్తకాలపై తుగ్లక్ (జగన్) ఫోటోతో ముద్రించి ప్రజాధనాన్ని వృధా చేశారని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకంలో ఎటువంటి పొరపాట్లు ఉన్నా.. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్వర్ణ గ్రామం (సచివాలయం)లో పిర్యాదు చేస్తే వారం రోజుల్లో సరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంకటేష్, ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి, ఎంపీడీవో వసంత్ కుమార్, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ విఠల్ రావు, యూనిట్ కన్వీనర్ కుత్తుం ప్రకాష్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లీన శ్రీను, సీనియర్ నాయకులు గోరకల దాసుతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఎయిర్పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ఉపాధి అవకాశాలు: ఎయి...