శ్రీకాకుళం జిల్లా పలాస(M) రంగోయి గ్రామంలో శుక్రవారం రెవెన్యూ గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నంతో కూడిన కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... గడిచిన ప్రభుత్వంలో ఓ తుగ్లక్ పాలన చూసామని, మన తాతలు, తండ్రిల ఆస్తుల పుస్తకాలపై తుగ్లక్ (జగన్) ఫోటోతో ముద్రించి ప్రజాధనాన్ని వృధా చేశారని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకంలో ఎటువంటి పొరపాట్లు ఉన్నా.. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్వర్ణ గ్రామం (సచివాలయం)లో పిర్యాదు చేస్తే వారం రోజుల్లో సరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంకటేష్, ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి, ఎంపీడీవో వసంత్ కుమార్, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ విఠల్ రావు, యూనిట్ కన్వీనర్ కుత్తుం ప్రకాష్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లీన శ్రీను, సీనియర్ నాయకులు గోరకల దాసుతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.