శ్రీకాకుళం జిల్లా పలాస(M) రంగోయి గ్రామంలో శుక్రవారం రెవెన్యూ గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నంతో కూడిన కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... గడిచిన ప్రభుత్వంలో ఓ తుగ్లక్ పాలన చూసామని, మన తాతలు, తండ్రిల ఆస్తుల పుస్తకాలపై తుగ్లక్ (జగన్) ఫోటోతో ముద్రించి ప్రజాధనాన్ని వృధా చేశారని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకంలో ఎటువంటి పొరపాట్లు ఉన్నా.. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్వర్ణ గ్రామం (సచివాలయం)లో పిర్యాదు చేస్తే వారం రోజుల్లో సరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంకటేష్, ఎమ్మార్వో కళ్యాణ్ చక్రవర్తి, ఎంపీడీవో వసంత్ కుమార్, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ విఠల్ రావు, యూనిట్ కన్వీనర్ కుత్తుం ప్రకాష్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లీన శ్రీను, సీనియర్ నాయకులు గోరకల దాసుతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.