మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ.... పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన అభ్యుదయ సైకిల్ ర్యాలీ యాత్ర నేడు(శనివారం) ఇచ్చాపురంలో ముగియనుంది. అనంతరం రాజావారి మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీనివాస్, మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు స్థానిక ఎమ్మెల్యే అశోక్ పాల్గొననున్నారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.