మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ.... పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన అభ్యుదయ సైకిల్ ర్యాలీ యాత్ర నేడు(శనివారం) ఇచ్చాపురంలో ముగియనుంది. అనంతరం రాజావారి మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీనివాస్, మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు స్థానిక ఎమ్మెల్యే అశోక్ పాల్గొననున్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.