శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగలనుంది. కవిటి మండలం నెలవంక గ్రామంలో నేడు(ఆదివారం) ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆధ్వర్యంలో వైకాపా ను వీడి టిడిపిలోకి భారీ చేరికలు రానున్నాయి. సర్పంచ్ దుర్గాశి కుమార్ మోహన్ రెడ్డి తోపాటు సుమారు 50 కుటుంబాలు పసుపు కండువా కప్పుకొనున్నాయి.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.