శ్రీకాకుళం జిల్లా పలాస(M) బ్రాహ్మణతర్ల గ్రామానికి చెందిన సాహు ఆనంద్, నీలిభద్ర గ్రామానికి చెందిన బెహరా రమేష్ గంజాయిను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరు చిన్నచిన్న ప్యాకెట్లుగా గంజాయిను తయారుచేసి యువతకు అమ్మేవారు. ఒడిస్సా రాష్ట్రం బరంపురం పట్టణానికి చెందిన పప్పు అనే వ్యక్తి వద్ద సుమారు నాలుగు కిలోల గంజాయి కొని గోనెసంచిలో తరలిస్తుండగా కంబ్రిగాం బ్రిడ్జ్ సమీపంలో... పోలీసులు కు పట్టుబడినట్లు కాశీబుగ్గ డి.ఎస్.పి షేక్ సహబజ్ అహ్మద్ బుధవారం మీడియాతో తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండల ఉద్దాన ప్రాంత ఇసుక నేలలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విరువుగా దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరంగా ఉంటాయి. సహజ సిద్ధంగా దొరికే ఈ పుట్టగొడుగులు ఎన్నో పోషక గుణాలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కరం. ఉద్దాన ప్రాంతంలో ఈ పుట్టగొడుగులను కొందరు నాన్ వెజ్ (మాంసాహారం)గా భావిస్తే మరికొందరు వెజ్ (శాఖాహారం) గా భావిస్తున్నారు. మరి పొడవాటి తోక కలిగిన ఈ పుట్టగొడుగులు మీరు ఎప్పుడైనా రుచి చూశారా..?