శ్రీకాకుళం జిల్లా పలాస(M) బ్రాహ్మణతర్ల గ్రామానికి చెందిన సాహు ఆనంద్, నీలిభద్ర గ్రామానికి చెందిన బెహరా రమేష్ గంజాయిను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరు చిన్నచిన్న ప్యాకెట్లుగా గంజాయిను తయారుచేసి యువతకు అమ్మేవారు. ఒడిస్సా రాష్ట్రం బరంపురం పట్టణానికి చెందిన పప్పు అనే వ్యక్తి వద్ద సుమారు నాలుగు కిలోల గంజాయి కొని గోనెసంచిలో తరలిస్తుండగా కంబ్రిగాం బ్రిడ్జ్ సమీపంలో... పోలీసులు కు పట్టుబడినట్లు కాశీబుగ్గ డి.ఎస్.పి షేక్ సహబజ్ అహ్మద్ బుధవారం మీడియాతో తెలిపారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.