శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో శనివారం డి.ఎస్.పి షేక్ సహబాజ్ అహమ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంక్రాంతి పండగ సందర్భంగా ఎవరైనా ఇళ్లకు తాళం వేసి వెళ్లినట్లయితే కచ్చితంగా పోలీస్ వారికి సమాచారం అందించాలని తెలిపారు. తాళం వేసిన ఇళ్లకు (ఎల్ హెచ్ ఎం ఎస్) సిస్టం అమర్చి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఇంట్లో బంగారం, డబ్బు వంటి విలువైన వస్తువులు ఉంచరాదని సూచించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.