శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో శనివారం డి.ఎస్.పి షేక్ సహబాజ్ అహమ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంక్రాంతి పండగ సందర్భంగా ఎవరైనా ఇళ్లకు తాళం వేసి వెళ్లినట్లయితే కచ్చితంగా పోలీస్ వారికి సమాచారం అందించాలని తెలిపారు. తాళం వేసిన ఇళ్లకు (ఎల్ హెచ్ ఎం ఎస్) సిస్టం అమర్చి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఇంట్లో బంగారం, డబ్బు వంటి విలువైన వస్తువులు ఉంచరాదని సూచించారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.