విజయనగరం జిల్లా పూసపేటరేగ(M) చింతల అగ్రహారం గ్రామ జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా నందిగాం(M) కాపు తెంబూరు గ్రామానికి చెందిన గజరావు నగేశ్(31) గా పోలీసులు గుర్తించారు. లగేజీ వ్యాన్ తో విజయవాడ వెళ్లి తిరిగి వస్తున్న నగేష్ జాతీయ రహదారి ప్రక్కన వాహనాన్ని ఆపి కాలకృత్యాల కోసం రోడ్డు దాటుతుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన నగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య భవాని తో పాటు ఐదేళ్ల పాప ఉన్నారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.