విజయనగరం జిల్లా పూసపేటరేగ(M) చింతల అగ్రహారం గ్రామ జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా నందిగాం(M) కాపు తెంబూరు గ్రామానికి చెందిన గజరావు నగేశ్(31) గా పోలీసులు గుర్తించారు. లగేజీ వ్యాన్ తో విజయవాడ వెళ్లి తిరిగి వస్తున్న నగేష్ జాతీయ రహదారి ప్రక్కన వాహనాన్ని ఆపి కాలకృత్యాల కోసం రోడ్డు దాటుతుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన నగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య భవాని తో పాటు ఐదేళ్ల పాప ఉన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.