శ్రీకాకుళం జిల్లా పలాస(M) శాసనాం గ్రామంలో సోమవారం రాత్రి ఒడిస్సా కు చెందిన యువకులు గ్రామంలో చొరబడి ఓ యువకుడిని చాకుతో బెదిరించారు. ఆ యువకుడు క్షణాల్లో తేరుకొని వారి ద్విచక్ర వాహన తాళం చెవిని తీసుకొని గ్రామంలోకి పారిపోయారు. సుమారు రాత్రి 10 గంటల సమయంలో ఒడిస్సా కు చెందిన మరో ఇద్దరు యువకులు అక్కడికి వచ్చి ద్విచక్ర వాహనం కోసం ఆరా తీయగా... గ్రామస్తులు వారిని బంధించి పోలీసులకు సమాచారం అందించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.