శ్రీకాకుళం జిల్లా పలాస(M) శాసనాం గ్రామంలో సోమవారం రాత్రి ఒడిస్సా కు చెందిన యువకులు గ్రామంలో చొరబడి ఓ యువకుడిని చాకుతో బెదిరించారు. ఆ యువకుడు క్షణాల్లో తేరుకొని వారి ద్విచక్ర వాహన తాళం చెవిని తీసుకొని గ్రామంలోకి పారిపోయారు. సుమారు రాత్రి 10 గంటల సమయంలో ఒడిస్సా కు చెందిన మరో ఇద్దరు యువకులు అక్కడికి వచ్చి ద్విచక్ర వాహనం కోసం ఆరా తీయగా... గ్రామస్తులు వారిని బంధించి పోలీసులకు సమాచారం అందించారు.
శ్రీకాకుళం... పలాస టోల్గేట్ లో రోజురోజుకు మితిమీరుతున్న అరాచకాలు... ప్రభుత్వం ఏదైనా...? చక్రం తిప్పుతున్న ముగ్గురు మొనగాళ్లు...! ఇక్కడ ఉద్యోగం లో చేరాలంటే వయసు పరిమితి ఉన్నప్పటికీ...? ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఎడిటింగ్ చేసి వచ్చినవారిని కాసులకు కక్కుర్తి పడి చక్రం తిప్పుతున్న ఆ మొనగాళ్లు...! కోల్కత్తా నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు 48 గంటలు సమీపిస్తున్న క్లియరెన్స్ చేయలేని టోల్ కాంట్రాక్టర్. జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మలుపు (528/450- LHS)వద్ద జరిగిన ఇన్సిడెంట్ పై చిన్నచూపు చూస్తున్న టోల్ యాజమాన్యంపై మండిపడుతున్న వాహనదారులు. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే ... బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్నలు వెల్లువొత్తుతున్నాయి.