శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామ సమీప సముద్ర తీరానికి భారీ తిమింగళం శుక్రవారం ఉదయం కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే... గమనించిన స్థానిక మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాశీబుగ్గ అటవీ శాఖ రేంజ్ అధికారి మురళీకృష్ణ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని తిమింగళం కు పోస్టుమార్టం నిర్వహించి సమీప ప్రాంతంలో ఖననం చేశారు. ఆరున్నర మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పుతో సుమారు రెండు టన్నుల బరువు ఉంటుందని ఆయన తెలిపారు. సముద్రం లోపల ప్రయాణించే భారీ పడవలు, వాడలు తగలడంతో ఇలా మృత్యువాత పడతాయని ఆయన తెలిపారు.
ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు సాధించిన పొల్లాడ యువకుడు బంగారు సందీప్ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పొల్లాడ గ్రామానికి చెందిన బంగారు సందీప్ (వయస్సు 23) ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలను సాధించి అరుదైన ఘనత సాధించారు. ఆయన రీజినల్ రూరల్ బ్యాంక్లో ప్రొబేషన్రీ ఆఫీసర్ (PO), ఐబీపీఎస్ క్లర్క్ మరియు రీజినల్ రూరల్ బ్యాంక్ క్లర్క్ పోస్టులకు ఎంపికై తన ప్రతిభను చాటుకున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు ఇలాంటి విజయాన్ని సాధించడం స్థానికంగా ఆనందం మరియు గర్వకారణంగా మారింది. చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన సందీప్ తన పాఠశాల విద్యను పూండి సాయి వినీత పాఠశాలలో పూర్తి చేశారు. అనంతరం శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, మునసబుపేటలో ఇంటర్మీడియట్ చదివారు. తరువాత విజయనగరం మహారాజా కళాశాలలో డిగ్రీ విద్యను పూర్తిచేసి, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో క్రమశిక్షణతో సన్నద్ధమయ్యారు. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజుకు అనేక గంటలు కృషి చేసి బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమయ్యారు. కష్టపడి చదివితే ఏ లక్ష్యమైనా సాధ్యమని సందీప్ నిరూపించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కు...