రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల వివరాలను సెంట్రల్ పోర్టల్లో నమోదు చేయడానికి గడువును మరో ఏడాది పొడిగించాలని కోరుతూ CM చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాశారు. డిసెంబర్ 5తో గడువు ముగియనున్న నేపథ్యంలో, రాష్ట్రంలో 4,748 రిజిస్టర్డ్, 10,000 అన్ రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 3,100 ఆస్తుల వివరాలు అప్లోడ్ చేసినా, సాంకేతిక, స్టేక్ హోల్డర్ల సమస్యల వల్ల పురోగతికి ఆటంకాలు ఎదురవుతున్నాయని సీఎం వివరించారు.
శ్రీకాకుళం... పలాస టోల్గేట్ లో రోజురోజుకు మితిమీరుతున్న అరాచకాలు... ప్రభుత్వం ఏదైనా...? చక్రం తిప్పుతున్న ముగ్గురు మొనగాళ్లు...! ఇక్కడ ఉద్యోగం లో చేరాలంటే వయసు పరిమితి ఉన్నప్పటికీ...? ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఎడిటింగ్ చేసి వచ్చినవారిని కాసులకు కక్కుర్తి పడి చక్రం తిప్పుతున్న ఆ మొనగాళ్లు...! కోల్కత్తా నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు 48 గంటలు సమీపిస్తున్న క్లియరెన్స్ చేయలేని టోల్ కాంట్రాక్టర్. జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మలుపు (528/450- LHS)వద్ద జరిగిన ఇన్సిడెంట్ పై చిన్నచూపు చూస్తున్న టోల్ యాజమాన్యంపై మండిపడుతున్న వాహనదారులు. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే ... బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్నలు వెల్లువొత్తుతున్నాయి.