నెల్లూరు జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెంలో టిడిపి నేత ఆధ్వర్యంలో గొట్టిపాటి ప్రసాద్ ను దుండగులు కత్తితో గొంతు కోసి దారుణ హత్యకు పాల్పడ్డారు. గ్రామ శివారులోని తన కోళ్ల ఫారంలో గొట్టిపాటి ప్రసాద్ పని చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.