డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు 10 రోజులు ఉంటుంది. భక్తులకు ఈసారి డబుల్ బోనాంజా లభించనుంది. సర్వదర్శనం టోకెన్లు కూడా ఆన్లైన్ విధానంలోనే జారీ చేస్తారు. ఆన్లైన్లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం లేదా ఉచిత సర్వదర్శనం టికెట్లు పొందవచ్చు. గతంలో జరిగిన తొక్కిసలాట కారణంగా టీటీడీ ఈ విధానాన్ని మార్చింది.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.