డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు 10 రోజులు ఉంటుంది. భక్తులకు ఈసారి డబుల్ బోనాంజా లభించనుంది. సర్వదర్శనం టోకెన్లు కూడా ఆన్లైన్ విధానంలోనే జారీ చేస్తారు. ఆన్లైన్లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం లేదా ఉచిత సర్వదర్శనం టికెట్లు పొందవచ్చు. గతంలో జరిగిన తొక్కిసలాట కారణంగా టీటీడీ ఈ విధానాన్ని మార్చింది.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.