శ్రీకాకుళం జిల్లా పలాస మండలం శాసనాం గ్రామ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి లారీ ముందు టైరు లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒడిస్సా రాష్ట్రం గజపతి జిల్లా అంతరసింగి గ్రామానికి చెందిన కే ఈశ్వరరావు (19) కు తీవ్ర గాయాలు కాగా, సునీల్ కుమార్ (19) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనపై కాశిబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు సాధించిన పొల్లాడ యువకుడు బంగారు సందీప్ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పొల్లాడ గ్రామానికి చెందిన బంగారు సందీప్ (వయస్సు 23) ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలను సాధించి అరుదైన ఘనత సాధించారు. ఆయన రీజినల్ రూరల్ బ్యాంక్లో ప్రొబేషన్రీ ఆఫీసర్ (PO), ఐబీపీఎస్ క్లర్క్ మరియు రీజినల్ రూరల్ బ్యాంక్ క్లర్క్ పోస్టులకు ఎంపికై తన ప్రతిభను చాటుకున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు ఇలాంటి విజయాన్ని సాధించడం స్థానికంగా ఆనందం మరియు గర్వకారణంగా మారింది. చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన సందీప్ తన పాఠశాల విద్యను పూండి సాయి వినీత పాఠశాలలో పూర్తి చేశారు. అనంతరం శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, మునసబుపేటలో ఇంటర్మీడియట్ చదివారు. తరువాత విజయనగరం మహారాజా కళాశాలలో డిగ్రీ విద్యను పూర్తిచేసి, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో క్రమశిక్షణతో సన్నద్ధమయ్యారు. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజుకు అనేక గంటలు కృషి చేసి బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమయ్యారు. కష్టపడి చదివితే ఏ లక్ష్యమైనా సాధ్యమని సందీప్ నిరూపించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కు...