శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రెండవ వార్డ్ నెమలికొండ దరి ఉన్న దత్తాత్రేయ ఆశ్రమం వద్ద 15వ ఆర్థిక సంఘ నిధులు సుమారు రూ. 11 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. అనంతరం దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇటీవల పలాసలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ముందస్తుగా భారీ భద్రత ఏర్పాట్లు నిర్వహించారు.
శ్రీకాకుళం... పలాస టోల్గేట్ లో రోజురోజుకు మితిమీరుతున్న అరాచకాలు... ప్రభుత్వం ఏదైనా...? చక్రం తిప్పుతున్న ముగ్గురు మొనగాళ్లు...! ఇక్కడ ఉద్యోగం లో చేరాలంటే వయసు పరిమితి ఉన్నప్పటికీ...? ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఎడిటింగ్ చేసి వచ్చినవారిని కాసులకు కక్కుర్తి పడి చక్రం తిప్పుతున్న ఆ మొనగాళ్లు...! కోల్కత్తా నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు 48 గంటలు సమీపిస్తున్న క్లియరెన్స్ చేయలేని టోల్ కాంట్రాక్టర్. జాతీయ రహదారిపై ప్రమాదకరమైన మలుపు (528/450- LHS)వద్ద జరిగిన ఇన్సిడెంట్ పై చిన్నచూపు చూస్తున్న టోల్ యాజమాన్యంపై మండిపడుతున్న వాహనదారులు. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే ... బాధ్యత ఎవరు వహిస్తారు అనే ప్రశ్నలు వెల్లువొత్తుతున్నాయి.