శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రెండవ వార్డ్ నెమలికొండ దరి ఉన్న దత్తాత్రేయ ఆశ్రమం వద్ద 15వ ఆర్థిక సంఘ నిధులు సుమారు రూ. 11 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. అనంతరం దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇటీవల పలాసలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ముందస్తుగా భారీ భద్రత ఏర్పాట్లు నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.