కాశీబుగ్గ టౌన్ సీఐ గా వై రామకృష్ణ ఆదివారం విధుల్లో చేరారు. కాగా ఈయన ఇదే పోలీస్ స్టేషన్ లో 09-11-2013 నుంచి 19-06-2016 వరకు సీఐ గా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే... విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ ట్రైనింగ్ కళాశాల నుంచి కాశీబుగ్గ స్టేషన్ లో సీఐ గా విధుల్లో చేరారు. ఇదే స్టేషన్లో సిఐ గా విధులు నిర్వహిస్తున్న సూర్యనారాయణ విఆర్ కు రిపోర్ట్ చేసినట్లు సమాచారం.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.