పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధి లేబర్ కాలనీలో మురుగు కాలువలు నిండి రోడ్లపై మురుగునీరు పారుతుంది. ఈ రోడ్డు దాటాలంటే సాహసమే చేయాలని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల పదోన్నతపై మున్సిపల్ కమిషనర్ గా విధుల్లో చేరిన శ్రీనివాసులు స్పందించి లేబర్ కాలనీలో మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.