శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధి గొల్లవీధిలో శనివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. సంక్రాంతికి ఇళ్లకు తాళం వేసి స్వగ్రామానికి వెళ్లడంతో ఒకేసారి నాలుగు ఇళ్లల్లో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం గమనించిన ఇంటి యాజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ చోరీ ఘటనలో ఎంత బంగారం, డబ్బు కొల్లగొట్టారు తెలియాల్సి ఉంది.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.