శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధి గొల్లవీధిలో శనివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. సంక్రాంతికి ఇళ్లకు తాళం వేసి స్వగ్రామానికి వెళ్లడంతో ఒకేసారి నాలుగు ఇళ్లల్లో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం గమనించిన ఇంటి యాజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ చోరీ ఘటనలో ఎంత బంగారం, డబ్బు కొల్లగొట్టారు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.