శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధి గొల్లవీధిలో శనివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. సంక్రాంతికి ఇళ్లకు తాళం వేసి స్వగ్రామానికి వెళ్లడంతో ఒకేసారి నాలుగు ఇళ్లల్లో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం గమనించిన ఇంటి యాజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ చోరీ ఘటనలో ఎంత బంగారం, డబ్బు కొల్లగొట్టారు తెలియాల్సి ఉంది.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.