శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటితో పాటు సాగునీరు అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న ఆప్షోర్ రిజర్వాయర్ పనులను మంగళవారం ఈ ఈ శేఖర్ తన సిబ్బందితో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు సిబ్బంది నీటి సంఘ అధ్యక్షులు నిరంజన్ పాల్గొన్నారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.