జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు సందర్భంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే... రాష్ట్ర పండగగా గుర్తింపు పొందడంతో భక్తులు వేలాదిమందిగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి ప్రసాదం పంపిణీ కొరత ఏర్పడడంతో ఎంతో నిరాశకు గురవుతున్నారు. అధికారులు, ఆలయ అభివృద్ధి కమిటీ స్పందించి తక్షణమే స్వామివారి ప్రసాదం భక్తులకు కొరత లేకుండా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.