శ్రీకాకుళం జిల్లా సోంపేట(M) బారువ జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి చెందగా... నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే... బారువ ఆసుపత్రి చికిత్స పొందుతూ మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మృతులు ఒడిస్సా వాసులుగా గుర్తించిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.