శ్రీకాకుళం జిల్లా సోంపేట(M) బారువ జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి చెందగా... నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే... బారువ ఆసుపత్రి చికిత్స పొందుతూ మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మృతులు ఒడిస్సా వాసులుగా గుర్తించిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.