శ్రీకాకుళం జిల్లా మందస మండలం బేతాళపురం గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది.. గ్రామంలో ఓ ఇల్లు నిర్మాణ పనులు చేపడుతుండగా... మహిళా కార్మికులపై ఒక్కసారిగా గోడ కూలిపోయింది. ఈ ఘటనలో బత్తిని కాంతమ్మ (39) అనే భవన నిర్మాణ కార్మికరాలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కార్మికురాలు కీలు దుర్గమ్మ (32) తీవ్ర గాయాలపాలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి తర్యాప్తు చేస్తున్నారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.