శ్రీకాకుళం జిల్లా మందస మండలం బేతాళపురం గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది.. గ్రామంలో ఓ ఇల్లు నిర్మాణ పనులు చేపడుతుండగా... మహిళా కార్మికులపై ఒక్కసారిగా గోడ కూలిపోయింది. ఈ ఘటనలో బత్తిని కాంతమ్మ (39) అనే భవన నిర్మాణ కార్మికరాలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కార్మికురాలు కీలు దుర్గమ్మ (32) తీవ్ర గాయాలపాలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి తర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో పశు వైద్య అధికారులు అజయ్, కళ్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. నట్టల నివారణ, గాలి కుంటి వ్యాధి, గర్భకోశ వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నాటు కోళ్లు, గొర్రెలు, మేకలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పెంపకదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, సునీత, శిరీష, సాయి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.