రథసప్తమి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించి కునేందుకు లక్షలాదిమంది భక్తులు పోటెత్తారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు భారీ భద్రత ఏర్పాట్లు నిర్వహించారు. మరోవైపు వృద్ధులు, చిన్నారులు క్యూ లైన్ లో ఉండేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్ర రద్దీని దృష్టిలో ఉంచుకొని స్థానికులు మధ్యాహ్నం అనంతరం దర్శనానికి రావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.