శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బుధవారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా 17వ తిలక్ నగర్ లో శ్రీ మంకినమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు రూ. 20 లక్షల సాధారణ నిధులతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్ను ఆమె ప్రారంభించారు. 13వ వార్డులో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. 5వ వార్డు తాళబద్ర గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్, మురుగు కాలువ పనులకు శంకుస్థాపన చేసి, రాజాం కాలనీలో సుమారు రూ. 11 లక్షల ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రతి వార్డులో ఉన్న మీ సమస్యలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తానని ఇందుకు మీరంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, చైర్మన్ బల్ల గిరిబాబు, ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, దువ్వాడ శ్రీకాంత్, బడ్డా నాగరాజు, చిన్ని కొత్త సత్యం, రామకృష్ణ, తిరుమలరావు, లోడగల కామేశ్వరరావు, గురుటి సూర్యనారాయణ, సవర రాంబాబు, గాలి కృష్ణారావు, శంకర్, సప్ప నవీన్, అనిల్ శర్మ, ఖగేశ్వరరావు తో పాటు కూటమి నాయకులు స్థానిక అధికారులు పాల్గొన్నారు.
ఎయిర్పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ఉపాధి అవకాశాలు: ఎయి...