శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బుధవారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా 17వ తిలక్ నగర్ లో శ్రీ మంకినమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు రూ. 20 లక్షల సాధారణ నిధులతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్ను ఆమె ప్రారంభించారు. 13వ వార్డులో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. 5వ వార్డు తాళబద్ర గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్, మురుగు కాలువ పనులకు శంకుస్థాపన చేసి, రాజాం కాలనీలో సుమారు రూ. 11 లక్షల ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రతి వార్డులో ఉన్న మీ సమస్యలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తానని ఇందుకు మీరంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, చైర్మన్ బల్ల గిరిబాబు, ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, దువ్వాడ శ్రీకాంత్, బడ్డా నాగరాజు, చిన్ని కొత్త సత్యం, రామకృష్ణ, తిరుమలరావు, లోడగల కామేశ్వరరావు, గురుటి సూర్యనారాయణ, సవర రాంబాబు, గాలి కృష్ణారావు, శంకర్, సప్ప నవీన్, అనిల్ శర్మ, ఖగేశ్వరరావు తో పాటు కూటమి నాయకులు స్థానిక అధికారులు పాల్గొన్నారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.