శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ రోటరీ నగర్ లో ఇటీవల జరిగిన చోరీ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రోటరీ నగర్ కు చెందిన సునీత పాత్రో ఇంట్లో ఇటీవల 5 తులాల బంగారం చోరికి గురైంది. చోరీ జరిగిన కేవలం ఒక్క రోజులో నిందితులను పట్టుకున్న సీఐ రామకృష్ణ తోపాటు సిబ్బందిని సోమవారం డిఎస్పి షేక్ సహబాజ్ అహమ్మద్ అభినందించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.