శ్రీకాకుళం జిల్లా పలాస బత్తుల వీధిలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు మైనర్ బాలికలతో పాటు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2.5 లక్షలు నగదు అర తూలం బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బత్తుల వీధికి చెందిన మళ్ళా ప్రేమకుమారి( వృద్ధురాలు)కి కూల్ డ్రింక్ లో నిద్ర మాత్రలు ఇచ్చి రూ. 2.8 లక్షలు, అర తూలం బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. చోరీ జరిగిన కేవలం ఒక్కరోజులో నిందితులను పట్టుకున్నట్లు సోమవారం డిఎస్పి షేక్ సహబాజ్ అహమ్మద్ తెలిపారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.