Skip to main content

ఎమ్మెల్యే శిరీష కృషితో మారనున్న పలాస ముఖచిత్రం

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 122 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలాస మున్సిపాలిటీ పరిధి కూటమి నేతలు కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల లేసి, బాణాసంచ కాలుస్తూ.. ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తపరిచారు. అనంతరం పలాస ఇందిరా చౌక్ వద్ద బాణాసంచా కాలుస్తూ... పలాస అభివృద్ధి కొరకై నిరంతరం ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే శిరీష కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, లోడగల కామేశ్వరరావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, గాలి కృష్ణారావు, దువ్వాడ శ్రీకాంత్, మల్లిపెద్ది చిన్ని, గురిటి సూర్యనారాయణ, గోల చంద్రరావు, అంబటి కృష్ణమూర్తి, అనీల్ శర్మ, సవర రాంబాబు డొక్కరి శంకర్, రవి శంకర్ గుప్తా, మళ్ళా శ్రీను, కొత్త సత్యం, దడియాల్ నర్సింగరావు, జోగ మల్లి, సార నోములరావు, తిరునాగర్ తిరుపతిరావు, పాండు రంగారావు, ధనుంజయ్ రావు, బుడత జగదీష్, బర్ల కృష్ణ, కొరికిన శంకర్, తివడాన శంకర్, పట్ట మల్లేష్,  ch రామకృష్ణ, ఇప్పిలి చణిక్య, కృష్ణాయక్, నాగు పండా, నాబిల్లి శ్రీను, శంకు శ్రీకాంత్, దేవా, కేదార్ తదితరులు పాల్గొన్నారు.

High Viewed News

మాజీ మంత్రి సీదిరి ప్రధాన అనుచరుడు అరెస్ట్

మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెదంచలలో జరిగిన పల్లెనిద్రలో పాల్గొన్న సీఐ రామకృష్ణ

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచలలో శుక్రవారం సీఐ గంధం రామకృష్ణ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, రాబోయే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉద్దానంలో దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరం.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండల ఉద్దాన ప్రాంత ఇసుక నేలలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విరువుగా దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరంగా ఉంటాయి. సహజ సిద్ధంగా దొరికే ఈ పుట్టగొడుగులు ఎన్నో పోషక గుణాలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే  ఆరోగ్యానికి ఎంతో మేలు కరం. ఉద్దాన ప్రాంతంలో ఈ పుట్టగొడుగులను కొందరు నాన్ వెజ్ (మాంసాహారం)గా భావిస్తే మరికొందరు వెజ్ (శాఖాహారం) గా భావిస్తున్నారు. మరి పొడవాటి తోక కలిగిన ఈ పుట్టగొడుగులు మీరు ఎప్పుడైనా రుచి చూశారా..?

ఒడిశా తీరంలో నౌక మునక.. 24 మంది గల్లంతు?

ఒడిశాలోని పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో నౌక మునిగిపోయింది. పనామా జెండాతో వెళ్తున్న కార్గో షిప్లో 24 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఒడిశా నుంచి ఐరన్ ఓర్ను సింగపూర్కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. అయితే ఘటనకు గల కారణాలు, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

పలాసలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు

పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 9వ వార్డ్ డెంకివీధిలో బుధవారం రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి పర్యటించి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గూర్చి వివరించారు. అనంతరం వారి నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.