పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 122 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలాస మున్సిపాలిటీ పరిధి కూటమి నేతలు కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల లేసి, బాణాసంచ కాలుస్తూ.. ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తపరిచారు. అనంతరం పలాస ఇందిరా చౌక్ వద్ద బాణాసంచా కాలుస్తూ... పలాస అభివృద్ధి కొరకై నిరంతరం ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే శిరీష కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, లోడగల కామేశ్వరరావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, గాలి కృష్ణారావు, దువ్వాడ శ్రీకాంత్, మల్లిపెద్ది చిన్ని, గురిటి సూర్యనారాయణ, గోల చంద్రరావు, అంబటి కృష్ణమూర్తి, అనీల్ శర్మ, సవర రాంబాబు డొక్కరి శంకర్, రవి శంకర్ గుప్తా, మళ్ళా శ్రీను, కొత్త సత్యం, దడియాల్ నర్సింగరావు, జోగ మల్లి, సార నోములరావు, తిరునాగర్ తిరుపతిరావు, పాండు రంగారావు, ధనుంజయ్ రావు, బుడత జగదీష్, బర్ల కృష్ణ, కొరికిన శంకర్, తివడాన శంకర్, పట్ట మల్లేష్, ch రామకృష్ణ, ఇప్పిలి చణిక్య, కృష్ణాయక్, నాగు పండా, నాబిల్లి శ్రీను, శంకు శ్రీకాంత్, దేవా, కేదార్ తదితరులు పాల్గొన్నారు.
ఎయిర్పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ఉపాధి అవకాశాలు: ఎయి...