శ్రీకాకుళం జిల్లా పలాసలో నేడు జరిగిన శ్రీ ఎల్లమ్మ తల్లి జామి జాతరలో మూడేళ్ల చిన్నారి తప్పిపోయింది. పలాస (M) కేదారిపురం గ్రామానికి చెందిన లికిత(3) తల్లిదండ్రులు వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి తన సిబ్బందితో నిమిషాల వ్యవధిలో చిన్నారిని వారి తల్లిదండ్రు వద్దకు చేర్చారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు రాము, లలిత పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.