శ్రీకాకుళం జిల్లా పలాసలో నేడు జరిగిన శ్రీ ఎల్లమ్మ తల్లి జామి జాతరలో మూడేళ్ల చిన్నారి తప్పిపోయింది. పలాస (M) కేదారిపురం గ్రామానికి చెందిన లికిత(3) తల్లిదండ్రులు వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి తన సిబ్బందితో నిమిషాల వ్యవధిలో చిన్నారిని వారి తల్లిదండ్రు వద్దకు చేర్చారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు రాము, లలిత పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండల ఉద్దాన ప్రాంత ఇసుక నేలలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విరువుగా దొరికే పుట్టగొడుగులు ఎంతో రుచికరంగా ఉంటాయి. సహజ సిద్ధంగా దొరికే ఈ పుట్టగొడుగులు ఎన్నో పోషక గుణాలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కరం. ఉద్దాన ప్రాంతంలో ఈ పుట్టగొడుగులను కొందరు నాన్ వెజ్ (మాంసాహారం)గా భావిస్తే మరికొందరు వెజ్ (శాఖాహారం) గా భావిస్తున్నారు. మరి పొడవాటి తోక కలిగిన ఈ పుట్టగొడుగులు మీరు ఎప్పుడైనా రుచి చూశారా..?