పలాస సబ్ స్టేషన్ పరిధిలో 11 కె.వి పీడర్ లైన్ మరమ్మత్తులు కారణంగా నేడు పలు ప్రాంతాలకు విద్యుత్ కు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొగిలిపాడు, ఉదయపురం, ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డు, శాసనాం, ఆసుపత్రి రోడ్డు, రోటరీ నగర్, సూది కొండ, ఆంధ్ర బ్యాంక్ రోడ్డు, న్యూ కాలనీ, ఫిష్ మార్కెట్, హరిజన వీధి ప్రాంతాలలో అంతరాయం కలుగుతుందని పలాస డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి యజ్ఞేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు శ్రీకాకుళం జిల్లా సోంపేట బిరుసువాడ కాలనీలో స్థానిక సిఐ మంగరాజు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ, ఇచ్చాపురం సిఐలు రామక్రిష్ణ, చిన్నంనాయుడు, ఈగల్ టీం తో కలిపి సుమారు 50 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్థానికులచే డ్రగ్స్ నిషేధ సమాజం నిర్మించేందుకు మేమంతా సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయించారు.