శ్రీకాకుళం జిల్లా మందస మండల గిరిజన ప్రాంత ప్రజల కోరిక మేరకు పలాస ఆర్టీసీ అధికారులతో మాట్లాడి మందస నుంచి పాతకోట కు ఆర్టీసీ బస్సు సర్వీస్ ను శనివారం ఎమ్మెల్యే గౌతు శిరీష పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గిరిజన ప్రాంత ప్రజలు తమ అవసరాలకు మందస రావాలంటే టక్కర్లు, ఆటోల పై ప్రమాదక ప్రయాణాలు చేసేవారని తెలిపారు. ఈ బస్సు సౌకర్యం వలన ఇక ప్రమాదక ప్రయాణాలు గిరిజనులకు తప్పాయన్నారు. ముఖ్యంగా మహిళలు మహిళా శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఎయిర్పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ఉపాధి అవకాశాలు: ఎయి...