కాశీబుగ్గ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుతున్న కీర్తి ఈరోజు విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థిని LMR NEWS తో మాట్లాడుతూ... నేను ఈ విజయం సాధించడానికి నన్ను వెన్నుదన్నుగా ఉన్న లెక్కల మాస్టర్ (వెంకట్రావు) సార్ ప్రధాన కారణమని ఆమె తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడిందని, పాఠశాలలో ఉపాధ్యాయుల సహకారంతో ఈ మార్కులు సాధించానని తెలిపారు. కూతురు విజయాన్ని తల్లి శివాని పండా కూడా ఆనందం వ్యక్తపరిచారు
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు (M) పూండిలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు పై అంతస్తులోకి ప్రవేశించి సూట్కేసులో భద్రపరిచిన మూడు తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నారు.