Skip to main content

విలేకరిని హత్య చేసిన నిందితుడును కఠినంగా శిక్షించాలని పలాసలో నిరసన

విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసన

-నిందితులను కఠినంగా  శిక్షించాలి 

కాశీబుగ్గ డిఎస్పికి వినతిపత్రం అందించిన పలాస జర్నలిస్టులు

చిత్తూరు జిల్లా వి.కోట మండల ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ మంగళవారం ఏపీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో పలాస నియోజకవర్గం జర్నలిస్ట్ లు కాశీబుగ్గ మున్సిపాలిటీలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. వాకింగ్‌కు వెళ్లి వస్తుండగా దుండగులు విలేకరిని కత్తులతో దాడి చేసి అత్యంత హేయంగా చంపడాన్ని ఏపీయుడబ్ల్యూజే  పలాస ప్రెస్ క్లబ్ లు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు తీవ్రంగా ఖండించారు. 
శ్రీగంధం చెట్ల అక్రమ రవాణాపై వార్తలు రాసినందుకే ఈ దారుణానికి ఒడిగట్టారని జర్నలిస్టులు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాశీబుగ్గ  లో మాహాత్మ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన అనంతరం,  కాశిబుగ్గ డిఎస్పి  టి భవాని కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు డి మహరణ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు సిహెచ్ జగదీష్ మాట్లాడుతూ చేయడం దారుణం అన్నారు హత్య చేసిన వారిని కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు, రాష్ట్రంలో జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. మృతుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిని చంపిన నిందితులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి" అని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యకమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా విలేకరులు హరి నారాయణ, అశోకు నారాయణ నాని భుజంగరావు నేతాజీ జయంత్ చిట్టి భీమారావు రవి చందన్ రావు మోహన్ భాస్కరరావు అంజి రూప్ సుందర్ సత్యం కుమార్ మేఘన కృష్ణ రమేష్ రవీంద్ర రవి తదితరులు పాల్గొన్నారు.

High Viewed News

ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది : జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్

ఎయిర్‌పోర్ట్ నిర్వాసిత గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ & ఎమ్మెల్యే శిరీష  ​శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మందస మండలం బిడిమి మరియు వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నిర్వాసితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ​​ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను, వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ​సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు: ​ఉపాధి అవకాశాలు: ఎయి...

పలాసలో హౌసింగ్ అధికారుల దందా...!

పీఎం జన్ మన్ ఇళ్ల లబ్ధిదారుల వద్ద హౌసింగ్ అధికారులు దోచుకుంటున్నారు. అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల వారికి ఇల్లు నిర్మాణానికి 2023లో "పీఎం జన్ మన్" పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పలాస మండల పరిధిలో లోత్తూరు, లొద్దభద్ర, అల్లుకోల, తర్లాకోట పంచాయతీల పరిధిలో 60 ఇల్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులు ఇల్లు నిర్మిస్తే రూ. 2.39 లక్షలు వారి బ్యాంక్ ఖాతాలో జామవుతుంది. కాగా హౌసింగ్ అధికారులు లబ్ధిదారుల వద్ద ఖర్చుల పేర్లతో సొమ్ము పడిన ప్రతిసారి డబ్బు వసూలు చేస్తున్నట్లు లబ్ధిదారులు తెలిపారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు పలాస వాసులు మృతి

తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులు మృతి. నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయ్యప్ప మాలదరించి 6 గురు యువకులు శబరిమలై వెళ్లి అక్కడ నుంచి రామేశ్వరం దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్ (24), పైడి సాయి (26) గా పోలీసులు గుర్తించారు.

పలాసలో కల్తీ మద్యం ఉత్తిదే : ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు

పలాస–కాశీబుగ్గ ప్రాంతంలో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారు ఆధారాలతో ముందుకు రావాలని, వారి సమక్షంలోనే సంబంధిత దుకాణాల నుంచి మద్యం నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

బారువ సముద్ర తీరంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం సోంపేట మండలం బారువ సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, JC ఫర్మన్ అహ్మద్ ఖాన్ తో కలసి యోగా ఆసనాలను వేశారు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి యోగా ద్వారా మానసిక శరీరిక ప్రశాంతతను పొంద వచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.