-నిందితులను కఠినంగా శిక్షించాలి
కాశీబుగ్గ డిఎస్పికి వినతిపత్రం అందించిన పలాస జర్నలిస్టులు
చిత్తూరు జిల్లా వి.కోట మండల ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ మంగళవారం ఏపీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో పలాస నియోజకవర్గం జర్నలిస్ట్ లు కాశీబుగ్గ మున్సిపాలిటీలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. వాకింగ్కు వెళ్లి వస్తుండగా దుండగులు విలేకరిని కత్తులతో దాడి చేసి అత్యంత హేయంగా చంపడాన్ని ఏపీయుడబ్ల్యూజే పలాస ప్రెస్ క్లబ్ లు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు తీవ్రంగా ఖండించారు.
శ్రీగంధం చెట్ల అక్రమ రవాణాపై వార్తలు రాసినందుకే ఈ దారుణానికి ఒడిగట్టారని జర్నలిస్టులు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాశీబుగ్గ లో మాహాత్మ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన అనంతరం, కాశిబుగ్గ డిఎస్పి టి భవాని కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు డి మహరణ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు సిహెచ్ జగదీష్ మాట్లాడుతూ చేయడం దారుణం అన్నారు హత్య చేసిన వారిని కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు, రాష్ట్రంలో జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. మృతుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిని చంపిన నిందితులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి" అని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యకమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా విలేకరులు హరి నారాయణ, అశోకు నారాయణ నాని భుజంగరావు నేతాజీ జయంత్ చిట్టి భీమారావు రవి చందన్ రావు మోహన్ భాస్కరరావు అంజి రూప్ సుందర్ సత్యం కుమార్ మేఘన కృష్ణ రమేష్ రవీంద్ర రవి తదితరులు పాల్గొన్నారు.