పలాస కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం దువ్వాడ శ్రీధర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా విభజించి పలాస కేంద్రంగా జిల్లా నాయకులు ప్రకటించాలని కోరారు. ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా పోరాడుతాం అని ఆయన ప్రకటించారు. ఆయన పిలుపుమేరకు పలు ప్రజాసంఘ నాయకులు, మేధావులు, ఉద్యోగులు, యువకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.