శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... బాధిత కుటుంబ సభ్యులకు జర్నలిస్టు, గుండుసూది PINN & AP 175 యూట్యూబ్ ఛానెల్స్ అధినేత మానెం శ్రీనివాస్ మంగళవారం పరామర్శించారు. అనంతరం తన యూట్యూబ్ ఛానెల్స్ ఫాలోవర్స్ అందించిన రూ. 5.50 లక్షలు అందించారు. ఈ మొత్తం సొమ్మును మృతుని భార్య ద్రౌపతి పేరున బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఫిక్స్ డిపాజిట్ చేసి గొప్ప మనసు చాటుకున్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.