శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం జంక్షన్ సమీపంలో కూటమి ప్రభుత్వం మొదటి విడత సుమారు రూ. 1.40 కోట్ల నిధులతో నిర్మించిన మయూర వనాన్ని బుధవారం Dc వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ... 120 హెక్టార్ల పరిధిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జాతీయ రహదారికి ఆనుకుని ఈ మయూర వనం రానున్న రోజుల్లో జంతు ప్రదర్శనశాలగా మార్చేందుకు కేంద్రం నుంచి అనుమతులు కోరమని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మయూర వనాన్ని ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సందర్శకులకు అనుమతిస్తారని, ప్రతి వ్యక్తికి 20 రూపాయలు టికెట్, పిల్లలకి ₹10 ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సప్నికల్ దినకర్, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, గ్రంధాలయ చైర్మన్ పీరికట్ల విఠల్, ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాస్, బిసి సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేష్, మండల అధ్యక్ష కార్యదర్శులు ఇతర ముఖ్య నాయకులు, కూటమి నాయకులు చిన్ని, నాగరాజు, అటవీశాఖ అధికారులు, ఆర్టీవో గారు వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.