శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో మంగళవారం ఎస్సై ఏ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. అనంతరం వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలు వసూలు చేసి, వాహన పత్రాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.