శ్రీకాకుళం జిల్లా పలాస ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో పాత జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సూది కొండ కాలనీకి చెందిన గొర్రెల కాపరి దుబ్బ దానయ్య (45) మృతి చెందారు. కాశీబుగ్గ పట్టణానికి చెందిన యువకుడు సిద్ధార్థ త్యాడి బుల్లెట్ వాహనంతో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.