శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి మూడు రోడ్ల జంక్షన్ వద్ద శుక్రవారం డ్రైనేజీ పై ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుడు కవిటి మండలం బైరిపురం గ్రామానికి చెందిన బుల్లోజు సోమేశ్వరరావు (36) గా గుర్తించారు. కాగా కుటుంబ కలహాలతో మృతుని భార్య తన కన్న వారైన కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి అంతరకుడ్డ గ్రామం ఉంది. ఘటనపై కాశిబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.