తప్పుడు వార్తలు ప్రచురించిన ఓ పత్రిక పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాశీబుగ్గ డిఎస్పి భవాని శనివారం రాత్రి జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈనెల 13వ తేదీన శ్రీకాకుళం జిల్లా మందస మండలం పితాతొలి జంక్షన్ వద్ద లగేజీ ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో.. నర్తు వెంకటరమణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయని, ఆయన విశాఖ కే జి హెచ్ లో చికిత్స పొందుతూ.. 14వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ ను తప్పించి వేరే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ప్రచురించిన వార్తను ఆమె తీవ్రంగా ఖండించారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.