శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ కేసులో మాజీ మంత్రి తనయుడు ఆరవ్ వర్మతో పాటు సిద్ధార్థ త్యాడి లకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.. ఘటనలో సాక్షాదారాలు తారుమారు చేశారని అభియోగంతో... రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అప్పలరాజు బెయిల్ పిటిషన్ ఆరువ జిల్లా అదనపు కోర్టు సోంపేట న్యాయమూర్తి శుక్రవారం డిస్మిస్ చేశారు.
మాజీ మంత్రి సీదిరి అనుచరుడు అల్లు వెంకటరమణను సోమవారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 10వ తేదీన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనలో వెంకటరమణ ఏ4 గా ఉన్నారు. దీంతో లక్ష్మీపురం లోని ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.